NATIONAL

దేశవ్యాప్తంగా బుధవారం సివిల్ డ్రిల్ చేయాలి-కేంద్ర హోంశాఖ

అమరావతి: జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 22న పహెల్గామ్ ఉగ్రదాడితో భారత్,, పాకిస్తాన్‌ ల మధ్య నెలకొన్నతీవ్ర ఉద్రిక్తతలు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.. బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డ్రిల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది.. యుద్ధ సమయంలో పౌరుల భద్రత,, సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది..యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్‌ నేతృత్వంలో మంగళవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది..దేశంలోని దాదాపు 244 జిల్లాల్లో మాక్‌డ్రిల్స్‌ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు..ఈ సమావేశంకు సివిల్‌ డిఫెన్స్‌ డీజీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు..
A,B.C కేటగిరీలుగా మాక్ డ్రిల్స్ ప్రాంతాలు:- పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకార దాడులు చేసేందుకు అవకాశలు వున్న సమయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్‌ కూడా ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది..బుధవారం మాక్‌డ్రిల్స్‌ నిర్వహించే ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు..A కేటగిరీలో దిల్లీ,,ముంబయి,,సూరత్‌,,వడోదర,,కక్రాపూర్‌,, తారాపూర్‌,,తాల్చేర్‌,,కోట,,రావత్‌,,చెన్నై,, కల్పక్కం,, నరోరా జిల్లాలు ఉన్నాయి..B కేటగిరీలో హైదరాబాద్‌,, విశాఖపట్నంతో సహా 201 జిల్లాలు ఉన్నాయి..ఇక C కేటగిరీలో 45 జిల్లాలు ఉన్నాయి.. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు గుజరాత్‌,,పంజాబ్‌,, హర్యానా,, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అదేశాలు జారీ చేసింది..
సమాచార మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం- ఎయిర్-రెయిడ్ హెచ్చరిక సైరెన్ల గురించి,, ప్రతికూల పరిస్థితుల్లో పౌరులకు వారిని వారు ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ ఇవ్వడం,,బంకర్లు-ట్రెంచ్లను శుభ్రం చేసుకునే సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ ఉంటాయి..బంకర్లు లేని ప్రాంతాల్లో సబ్ వేలను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో అధికారులు సూచనలు చేయనున్నారు..అత్యవసర సమయంలో ప్రజలను తరలించే ప్రణాళికలు గురించి ఈ డ్రిల్స్ ఉంటాయి.. ప్రాథమిక పౌర రక్షణ పద్ధతుల ద్వారా శత్రు దాడుల సమయంలో తమను తాము రక్షించుకోవడానికి విద్యార్థులతో సహా ప్రజలకు శిక్షణ ఇవ్వబడుతుంది..ఈ డ్రిల్ సమయంలో బ్లాక్అవుట్ వ్యాయామాలు ఉంటాయి..అలాగే వైమానిక దాడి సమయంలో స్థానికులు పరిస్థితులను అనుగుణంగా లైట్లు ఆపివేయడం లాంటి చేయాల్సి వుంటుంది..వైమానిక స్థావరాలు,చమురు శుద్ధి కర్మాగారాలు-రైలు యార్డులు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను వైమానిక గుర్తింపు లేదా దాడి నుంచి రక్షించడానికి అధికారులు డ్రిల్ నిర్వహిస్తారు.
మే బుధవారం(7వ తేదిన):- దేశంలోని 244 జిల్లాలో గ్రామ స్థాయి నుంచి ఈ మాక్ డ్రిల్స్ చేపట్టాలని ఆదేశించింది.. రాష్ట్రాలు,, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పౌర రక్షణ యంత్రాంగాల సంసిద్ధతను అంచనా వేయడం కోసమే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది..ఈ కార్యక్రమంలో జిల్లా కంట్రోలర్లు,, జిల్లా అధికారులు,, పౌర రక్షణ వార్డెన్లు,,వలంటీర్లు,, హోమ్ గార్డులు ఎన్.సి.సి,,ఎన్.ఎస్.ఎస్,,వాలంటీర్లు నెహ్రూ యువ కేంద్రం,,కళాశాల,,పాఠశాల విద్యార్థులు పాల్గొనే విధంగా చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *