CRIMEDISTRICTS

ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠా అరెస్ట్-ఎస్పీ కృష్ణకాంత్

నెల్లూరు: నగరంలో నివాసం వుంటున్న ఓ మహిళకు,ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని ఆశ చూపి,పలు దపాలుగా జమ చేసిన నగదుకు రెట్టింపు డబ్బును ఆశ చూపిస్తూ, సైబర్ నేరగాళ్లు 2.46 కోట్లు వారి బ్యాంకు అకౌంట్ లో వేయించుకున్నరని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు.శనివారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బదితురాలి తన నగదును ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రయత్నించగా,డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి, చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు.. మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిన్నబజార్ పోలీసుస్టేషన్ పోలీసులు, జిల్లా యస్.పి.ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు..తీగ లాగితే డొంక కదిలినట్లు కూపి లాగడంతో వీరు దొరికారని తెలిపారు..నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి 39.40 లక్షల నగదు హోల్డ్ చెయ్యమని బ్యాంక్ అధికారులను కోరడం జరిగిందన్నారు..

కేసు వివరాలు: Cr.No.64/2025 U/s 318(4), 338, 336 (3), 340(2), r/w 61 (2) BNS and Sec 66(c)(d) of IT Act, 2008 of Chinnabazar PSలో కేసు నమోదు చేయడం జరిగింది..అరెస్ట్ చేసిన ముద్దాయిల వివరాలు:1. Gogaram,2) HemanthKumar,3) Kailash 4) Nagaram,5) Ramaramలు వున్నారు..(ఇతను రాజస్తాన్ వుంటాడు)

సైబర్ నేరాలకు వీళ్లు అనుసరించే పద్దతి:- 7 మంది ముద్దాయిలు అరెస్ట్ చేసి విచారించినప్పుడు,,వారు సుమారు 2.46 కోట్లు బాధితుల నగదు కాజేసినట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపారు..సైబర్ మోసగాళ్లు నకిలీ ఆధార్-పాన్ కార్డులను సృష్టించి, బ్యాంక్ అకౌంట్ లను ఓపెన్ చేసి, సైబర్ నేరాలకు వినియోగిస్తారు. బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం లేని రోడ్‌సైడ్ సేల్ పాయింట్ల నుండి D-KYC ద్వారా సిమ్ కార్డులను పొందుతారు. బ్యాంకు అధికారులను సంప్రదించి ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి కరెంట్ ఖాతాలను ఓపెన్ చేస్తారు. IDFC బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, YES బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI మొదలైన చిన్న బ్యాంకులతో బ్యాంకు ఖాతాలను తెరిచి, ఖాతాలను తెరవడానికి నగదు చెల్లించి, ఫలితంగా, బ్యాంకు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా కరెంట్ ఖాతాలను ఓపెన్ చేస్తారు. బ్యాంక్ ఖాతా పాస్‌బుక్‌లను కొరియర్ ద్వారా రాజస్థాన్ లోని ప్రాధాన ముద్దాయికికు పంపుతారు. SMS APK ఫైల్ ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా బ్యాంకు-లింక్ చేయబడిన ఫోన్ నంబర్‌లను వేర్వేరు మొబైల్ ఫోన్‌లలో ఉంచి, ప్రధాన నిందితులు సులభంగా యాక్సెస్ చేయడానికి అన్నింటినీ ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేశారు. నిందితులందరికీ రూ.15,000/- నుండి రూ. నెలకు 20,000/- రూపాయలు జీతం ఇస్తాడు మరియు కరెంట్ ఖాతా తెరవడానికి రూ.1,00,000/- కమిషన్ మరియు పొదుపు ఖాతా తెరవడానికి రూ.20,000/- కమిషన్ పొందుతారు. ముద్దాయిల ద్వారా IDBI, కర్ణాటక, IOC బ్యాంక్ మొదలైన వివిధ బ్యాంకులతో బ్యాంకు ఖాతాలను సృష్టించారు. ఖాతాలను పొందిన తర్వాత వారు రాజస్థాన్‌లో ఉంటున్న ప్రధాన నిందితుడైన రమారామ్‌ల ద్వారా సైబర్ ఫ్రాడ్స్ చేస్తారు..

స్వాధీనపరచుకున్న వస్తువులు:- 2 లక్షల నగదు, 29 స్మార్ట్‌ ఫోన్‌లు, 21 కీప్యాడ్ ఫోన్‌లు, 57 ATM కార్డులు,1 wifi router,1 ప్రింటర్,  ల్యాప్‌టాప్, 1 కార్డ్ కటింగ్ మెషిన్,  లామినేషన్ మెషిన్, పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు..

ఈ కేసులో రాజస్థాన్ కి సంబంధించిన 5 గురు ముద్దాయిలు ఇప్పటి వరకూ 236 బ్యాంక్ అక్కౌంట్స్ ను ఫేక్ ID లతో అక్కౌంట్స్ ఓపెన్ చేశారని,,236 బ్యాంక్ అక్కౌంట్స్ లో 36 అక్కౌంట్స్ మీధ 436 కంప్లైట్స్ NCRP పోర్టల్ లో రైస్ చేయడం జరిగినదని తెలిపారు..చిన్నబజార్ CI చిట్టెం.కోటేశ్వరరావు,, సైబర్ క్రైమ్ CI వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.ముద్దాయిలను అరెస్ట్ చేసిన చిన్నబజార్-సైబర్ పోలీసు సిబ్బంది, అధికారులను ఎస్పీ అభినందించారు.( సైబర్ నేరాలు ఇతర ఆన్లైన్ మోసాల బారిన పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సైబ‌ర్ మిత్ర వాట్సాప్ నంబ‌రును 9121211100, 1930, NCRP Portal అయిన cybercrime.gov.in లకు సమాచారం తెలియజేయాలని తద్వారా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవచ్చునని తెలియజేశారు.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *