తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్- 38 మంది మావోయిస్టులు మృతి?
4హైదరాబాద్: ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది..మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ కీలక నేతలు హిడ్మా, దేవా టార్గెట్గా జరుగుతున్న ఈ ఆపరేషన్లో మూడు రాష్ట్రాల నుంచి భధ్రత బలగాలు పాల్గొన్నాయి. శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయని సమాచారం..ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందారు..ఎదురుకాల్పుల్లో ఓ జావాన్కు గాయాలయ్యాయి..ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది..కర్రెగుట్టలో సుమారు 1000 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం..మావోయిస్టుల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా డ్రోన్ల సాయంతో ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజననులు భయాందోళనలకు గురవుతున్నారు. భద్రతా సిబ్బందికి 8 హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, భోజనాలు, నీటిని సరఫరా చేస్తున్నారు.