రాబోయే మూడు రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు
అమరావతి: మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి వున్నదని వాతావరణశాఖ పేర్కొంది..వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా వున్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-శనివారం,ఆదివారం,సోమవారం- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది..
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- శనివారం,ఆదివారం,సోమవారం:-వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
రాయలసీమ:-శనివారం,ఆదివారం,సోమవారం-తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది..
కోస్తా ఆంద్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల రెండు రోజుల్లో వేడి తేమ, అసౌకర్యమైన వాతావరణముతో పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే 5 రోజుల్లో ఎలాంటి మార్పు లేదు.