మీ సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా మీ వద్దకే వచ్చా-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
బటన్ నొక్కలేక కాదు…
అమరావతి: చేపట వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు “మత్స్యకార సేవలో” పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంజిల్లా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అన్నారు.. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని, కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని,, ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు..వేట విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు.. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోందని చెప్పారు.. ‘గత నాయకుల మాదిరిగా మేము కూడా బటన్ నొక్కొచ్చు కానీ నేరుగా మీ దగ్గరికే వచ్చి, మీ సమస్యలు తెలుసుకుని,మీకే నేరుగా పథకాలు అందిస్తున్నాం అన్నారు..గతంలో నేతలు వస్తే చెట్టు నరికేయడం,,పరదాలు కట్టడం జరిగేవని విమర్శించారు.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చేందుకు 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని,,ఏడాదిలోగా షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు..దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో ఏపీ నుంచే 29% అని వెల్లడించారు..మత్స్యకారుల పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు..ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని,,అవకాశాలను ఉపయోగించుకుని జీవితంలో ఉన్నతస్థాయికి రావాలన్నారు.. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని అలాగే స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.