గాలికి, శ్రీనివాస్ రెడ్డికి ఏడు సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన సిబీఐ కోర్టు
అమరావతి: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు గాలి.జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డికి 7 సంవత్సరాల శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది..ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చేసింది..సబితతోపాటు A8 కృపానందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది..నా వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తుంచి శిక్ష తగ్గించాలని గాలి జనార్దన్ రెడ్డి కోరగా,,పది సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని గాలిని, జడ్జీ ప్రశ్నించారు.. మీరు యావ జీవశిక్షకు అర్హులని జడ్జీ వ్యాఖ్యనించారు..
(ఓబులాపురం అక్రమ మైనింగ్పై 2009, డిసెంబర్ 7వ తేదిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.. 2011లో మొదటి ఛార్జీషీట్ దాఖలు చేశారు..అందులో A1,, A2లుగా ఉన్న గాలి జానార్దన్ రెడ్డి,,ఆయన సోదరుడు శ్రీనివాసరెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైన్స్ ను తవ్వి వాటిని ఎక్స్ పోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.. దీని ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ ఛార్జీషీట్లో పొందుపర్చారు..ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు.)