తెలంగాణ రాష్ట్రానికి సౌర పంపు సెట్లను భారీగా కేటాయించాలి- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి మూడు వినతిపత్రాలు అందజేశారు.
1.ముందే నిర్ణయించిన విధంగా పిఎం కుసుం కంపోనెంట్ ఎ కింద 500 KW నుండి 2 MW ల సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన కోసం విజ్ఞప్తి,
2.పిఎం కుసుం కంపోనెంట్ (బి) కింద ఒక లక్ష సౌర పంపు సెట్ల కేటాయింపుల కోసం వినతి,
3.పిఎం కుసుం కంపోనెంట్ సి కింద 2 లక్షల పంపు సెట్ల కేటాయింపు కోసం విజ్ఞప్తి చేశారు..
వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్దతతో పనిచేస్తున్న రాష్ట్రానికి కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు చేసేందుకు వీలవుతుందని వివరించారు.