అమరావతి,విశాఖపట్నం మధ్య రెండు విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అమరావతి: అమరావతి,, ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం ఆనందంగా ఉందని,, ఇందులో భాగంగా కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు..ఆదివారం ఎయిర్ ఇండియా,, ఇండిగో సర్వీసులను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్- ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 21.00 గంటలకు విశాఖ చేరుతుంది.. అలాగే ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 19.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 20.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.. తిరుగు ప్రయాణంలో 20.45 గంటలకు బయలుదేరి 21.50 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుంది..ఈ అనుసంధానం వల్లన ప్రజా రవాణా,,రాష్ట్ర ఆర్ధిక ప్రగతి దొహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు..ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు PGVR నాయుడు (గనబాబు) ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.