భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాలు-మంత్రి నారాయణ
అమరావతి: నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాసులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. త్వరలోనే 1400 కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు అందుకోబోతున్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన దొంగ పట్టాలతో మోసపోయామని స్థానికులు ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్ది నారాయణ ముందు అవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే అన్నిశాఖల అధికారులను సమన్వయ పరిచి పరిష్కరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. క్యాబినెట్ లో ఆమోదముద్ర లభించేలా చేశారు.భగత్ సింగ్ కాలనీ వాసులకు గత ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేసిందని ఆరోపించారు. మాటల ప్రభుత్వానికి చేతల ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసానికి ఇదే నిదర్శనమని మంత్రి నారాయణ అన్నారు.