ఎపిని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రభుత్వం బాటలు వేస్తొంది-మంత్రి లోకేష్
LG శ్రీసిటీ యూనిట్ భూమిపూజ..
తిరుపతి: రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ L.G ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మేం ఈరోజు L.G యూనిట్ కు మాత్రమే కాదు-ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఇది మన రాష్ట్రంతోపాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. ఆవిష్కరణ పెట్టుబడిని కలిసే చోట, భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ₹5,000 కోట్లకు పైగా పెట్టుబడితో LG ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను తీసుకురావడమే గాక ఎపిని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది.
రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నాం:- LG ఫ్యాక్టరీ అధునాతన గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు స్మార్ట్, ఇంధన -సమర్థవంతమైన సాంకేతికతతో ఉత్పత్తులను అందిస్తుంది.ఎల్ జి ప్రధాన యూనిట్ దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది.LG ముఖ్య విక్రేతలు అదనంగా ₹839 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా మరో 690 కి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తారు.
AI-ఆధారిత తయారీ:- LG సంస్థ, దాని భాగస్వాములు కలిసి భారతీయ గడ్డపై AI-ఆధారిత తయారీ, స్మార్ట్ ఉత్పత్తి ప్రక్రియలు, ఎనర్జీ ఎఫిషియంట్ విధానాలు, అత్యాధునిక సాంకేతికతలను తీసుకువస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచస్థాయి కేంద్రంగా ఎపిని మార్చాలనే మా ఆశయాన్ని LG సంస్థ ముందుకు తీసుకెళ్తోంది.
ఎయిర్ పోర్టుకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తాం:- ఎల్జి యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం, ఇక్కడ అనుబంధ యూనిట్లతోపాటు LG సిటీ నిర్మించండి. రాబోయే నాలుగేళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం తో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తాం.
కొరియా రాయబారి:-భారత్ లో కొరియా రాయబారి లీ సియాంగ్ హూ మాట్లాడుతూ… గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తమ దేశానికి చెందిన KIA కంపెనీ ఏర్పాటైంది, ఇప్పుడు LG వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తున్న చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.