AP&TGNATIONAL

ఉత్తరాఖండ్‌ లో కూలిపోయిన హెలికాప్టర్-5 మంది మృతి

అమరావతి: ఉత్తరాఖండ్‌ లో గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..పర్యాటకులతో వెళుతున్న AeroTrans Services Private Limitedకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా మొత్తం ఏడుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉదయం 8:45 గంటల ప్రాంతంలో రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారిపై కూలిపోయింది..ఈ ప్రమాదంలో 5 మంది పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు..సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.. డెహ్రాడూన్‌లోని సహస్త్రధార హెలిప్యాడ్ నుంచి యమునోత్రిలోని ఖర్సాలి హెలిప్యాడ్‌కు హెలికాప్టర్ బయలుదేరిందని,, కెప్టెన్ రాబిన్ సింగ్ హెలికాప్టర్‌ను నడుపుతున్నాడని SDRF అధికారులు తెలిపారు.. హెలికాప్టర్ ప్రమాదలో నలుగురు ముంబైకి చెందినవారు కాగా మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.,పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి:- హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు., గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు..ప్రమాదంపై దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *