శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం-కూర్మనాథ్
అమరావతి: గురువారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు,40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.అలాగే రేపు ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు..బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86 మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ అధికవర్షపాతం, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 40.7°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.