AP&TG

30 ప్రతిపాదనలు అమోదించిన రాష్ట్ర మంత్రి మండలి

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…

ఉగ్రవాదానికి వ్యవతిరేఖంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్ కు మంత్రి మండలి సంఘీబావాన్ని వ్యక్తం చేసింది.ఈ ఆపరేషన్ లో ఆర్మీ చూపుతున్న శక్తి యుక్తులకు మంత్రి మండల అభినందలు తెలిపింది.

1.సాధారణ పరిపాలన శాఖ (రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ):- ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్ర రాజధాని పేరును “అమరావతి” గా నిర్ణయిస్తూ  గతంలోని AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 యొక్క సెక్షన్-5 యొక్క సబ్ సెక్షన్ (2) మరియు సెక్షన్ -5కు వివరణలో చట్ట సవరణ కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

  1. పురపాల మరియు పట్టణాభివృది శాఖ:- అమృత్-2.0 కింద రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక మొదటి & రెండవ విడతలో గతంలో చేసిన సవరణల అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంస్థల్లో 281 పనులను SNA-SPARSH ప్లాట్‌ఫాం ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (CHAM) కింద చేపట్టడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఈ పనులకు సంబందించి ప్రతిపాదించిన 12 రకాల నిబంధనలకు కూడా ఆమోదం తెల్పింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించడం జరుగుతుంది.
  2. జలవనరుల శాఖ:-ఒక ఏజెన్సీ/వ్యక్తిని కాంట్రాక్టర్‌గా నమోదు చేసేందుకు కాంట్రాక్టర్ గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటూ బ్లాక్ పీరియడ్‌ను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెల్పింది.
  3. జలవనరుల శాఖ:- “జలహారతి కార్పొరేషన్” పేరుతో కంపెనీల చట్టం, 2013 ప్రకారం 100% రాష్ట్ర యాజమాన్య కంపెనీగా ప్రత్యేక ప్రయోజన వాహనం ఏర్పాటు కోసం డైరెక్టర్ల బోర్డు సంస్థకు సంబంధించి GO.Ms.No.16, నీటి వనరుల (ప్రాజెక్ట్స్.II) శాఖ, తేదీ:08.04.2025 లో జారీ చేసిన ఉత్తర్వులను సవరించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  4. జలవనరుల శాఖ:-2025-26 సంవత్సరానికి పెద్ద, మధ్యమ మరియు చిన్న నీటిపారుదల వనరులకు సంబంధించి రూ.345.39 కోట్లతో 7174 ఆపరేషన్ మరియు నిర్వహణ పనులకు పరిపాలనా ఆమోదం కోసం మరియు నీటి వినియోగదారుల సంఘాలు అందుబాటులో లేని 7 రోజులలోపు రూ.10.00 లక్షల విలువ కంటే పైబడిన పనులకు స్వల్పకాలిక టెండర్ నోటీసును ఆహ్వానించడానికి అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెల్పింది.
  5. జలవనరుల శాఖ:-వాణిజ్యేతర ప్రయోజనాల కోసమై రైతులు తమ స్వంత ఖర్చులతో చిన్న నీటిపారుదల చెరువుల నుండి మట్టి తవ్వకం మరియు రవాణాకు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  6. LFB & IMS విభాగం (కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు & బీమా వైద్య సేవలు):- భారత రాష్ట్రపతి ఆమోదం కోసం వేచిఉన్న”పారిశ్రామిక వివాదాల (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019″ను ఉపసంహరించుకునే చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  7. LFB & IMS విభాగం (కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు & బీమా వైద్య సేవలు):-కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వద్ద పెండింగ్‌లో ఉన్న “కార్మిక చట్టాలు (ఆంధ్రప్రదేశ్ నేరాల సమ్మేళనం కోసం సవరణ) బిల్లు, 2019 (ఎల్.ఎ.బిల్ నెం.9 ఆఫ్ 2019) ను ఉపసంహరించుకునే చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  8. LFB & IMS విభాగం (కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు & బీమా వైద్య సేవలు):- భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వద్ద పెండింగ్‌లో ఉన్న “ఫ్యాక్టరీల (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019” ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

10.పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ (AHDDF): ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు నిషేధ కాలంలో సముద్ర చేపల వేట నిషేధ ఉపశమనంగా  ప్రతి కుటుంబానికి అందజేస్తున్న రూ.10,000/- లను రూ.20,000/- కు పెంచుతూ  ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.258.35 కోట్ల మేర లబ్ది చేకూర్చే విధంగా  GO.Ms.No.12, AH DD & F (ఫిష్) డిపార్ట్‌మెంట్, dt:25.04.2025 లో జారీ చేయబడిన ఉత్తర్వులను ఆమోదించడానికి చేసిన ప్రతిపాదనకు మరియు 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి ఈ పథకం పేరును “మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్”గా పునరుద్ధరించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

  1. రెవెన్యూ (భూములు):-YSR జిల్లా కొండాపూర్ (మం), కె.బొమ్మేపల్లి (గ్రా) లోని సర్వే నెం.307లో ఉన్న 150.00 ఎకరాలు మరియు సర్వే నెం.308లో ఎక.41.64 సెం., మొత్తం ఎక.191.64 సెం. భూమిని M/s అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 1000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపించడానికి NREDCAP కు కౌలు ప్రాతిపదికన కేటాయించడానికి ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మరియు ఎకరానికి సంవత్సరానికి రూ.31,000ల కౌలు రేటుతో, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెరుగుదలతో ప్రాజెక్టు కాలం (40 సంవత్సరాల నిర్వహణ కాలం మరియు 6 సంవత్సరాల నిర్మాణ కాలం, మొత్తం 46 సంవత్సరాలు) పాటు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  2. రెవెన్యూ (భూములు):-డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన (మం), చిర్రయనం (గ్రా)లో సర్వే నెం.1లో గల ఎక.5.00 సెం.ప్రభుత్వ భూమిలో M/s ప్లూటస్ అక్వా LLP కు బురద పీతల హ్యాచరీ స్థాపించడానికి మార్కెట్ విలువ చెల్లింపుపై ఏడాదికి ఎకరానికి రూ.2.50 లక్షల లీజు ప్రాతిపదికన 15 సంవత్సరాల కాల పరిమితికి కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  3. రెవెన్యూ (భూములు):-కర్నూలు రూరల్ (మం), బి.తండ్రపాడు గ్రామంలో సర్వే నెం.277/7Bలో ఎక.1.95 సెం. భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం LNG HUB స్థాపించడానికి BSO 24 ప్రకారం మరియు G.O.Ms.No.571 రెవిన్యూ శాఖ, తే.14.09.2012 ప్రకారం ఎకరానికి రూ.61,23,516  మార్కెట్ విలువ చెల్లించిన తదుపరి బదిలీ చేయుటకు మరియు కర్నూలు పట్టణాభివృద్ది సంస్థ ఆమోదించిన మాస్టర్ ప్లాన్ లో మిశ్రమ మరియు నివాస భూ వినియోగం నుండి  పారిశ్రామిక వినియోగానికి మార్పిడి చేయుటకు ఇతర సాధారణ షరతులకు లోబడి కేటాయించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

14.రెవెన్యూ (భూములు):-విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం మండలం, అన్నవరం గ్రామంలోని సర్వే నెం.101/1లో గల ఎక.18.70 సెం. ప్రభుత్వ భూములను బీచ్ రిసార్ట్ మరియు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, విజయవాడకి బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

  1. రెవెన్యూ (భూములు):- చిత్తూరు జిల్లా కుప్పం (మం) పాలర్లపల్లె (గ్రా) సర్వే నెం.221లో గల ఎక.18.70 సెం. ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం APIICకి GO.Ms.No.106, రెవెన్యూ (అసైన్-I) శాఖ, తేదీ.16.03.2017 ప్రకారం ఉచితంగా కేటాయించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

16.రెవెన్యూ (దేవాదాయ):-TTDలోని ఐటి విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటి) పోస్టును జనరల్ మేనేజర్ (ఐటి)గా అప్‌గ్రేడ్ చేయడానికి మరియు ఆ పోస్టు వేతన స్కేలును TTDలో సూపరింటెండింగ్ ఇంజనీర్ స్కేలు రూ.1,01,970-1,74,790 (RPS-2022) తో సమానం ఖరారు చేయడానికి ఆమోదం.

  1. రెవెన్యూ (దేవాదాయ):-TTDలో అర్బన్ డిజైన్ & ప్లానింగ్ (UDP) సెల్ ఏర్పాటు చేయడానికి మరియు ప్రతిపాదిత UDP సెల్‌కు నూతనంగా (8) పోస్టుల కల్పనకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
  2. యువజన, క్రీడా, పర్యాటక & సాంస్కృతిక శాఖ (పర్యాటకం):- AP పర్యాటక విధానం 2024-29 కి అనుబంధంగా తీసుకు వచ్చిన Employment Incentive Policy (ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానం)కి ఆమోదం. ఈ విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు రూ.24.70 కోట్లు ఉద్యోగ కల్పన ప్రోత్సహలుగా అందజేస్తారు.

19.యువజన, క్రీడా, పర్యాటక & సాంస్కృతిక శాఖ (పర్యాటకం):-2025-26 ఆర్థిక సంవత్సరానికి కార్యక్రమాలు మరియు ఈవెంట్‌ల నిర్వహణ కోసం AP పర్యాటక అథారిటీకి HoA:380-387 గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ కింద రూ.78.00 కోట్ల బడ్జెట్ ను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *