హైదరాబాద్లో భారీ వర్షం-ఇద్దరు మృతి?
హైదరాబాద్: హైదరాబాద్లో మంగళవారం తెల్లవారు జాము 3.30 గంటల నుంచి కుండపోతగా వర్షం కురిసింది.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్నగర్, కొంపల్లి, మాదాపూర్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్ భారీ వర్షం కురిసింది..ఎడతెరపి లేకుండా కురుసిన వర్షంతో రోడ్లలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.. పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.. పార్సిగుట్టలో భారీగా వరద రావడంతో లు ప్రాంతాలు ప్రమాద అంచుల్లో ఉన్నాయి..గుర్తుతెలియని వ్యక్తి వర్షపు నీటిలో కొట్టుకుపోయారు..సనత్ నగర్ ప్రాంతంలో అనిల్ అనే యువకుడు మరణించినట్ల సమాచారం..అలాగే వర్షం నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి.. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమస్యకు టోల్ఫ్రీ 040-21111111, 9000113667కు సంప్రదించాలని తెలిపారు.