తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించిన పి.వి.సింధు
అమరావతి: పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించింది..మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది..ఈ మ్యా చ్ లో సింధు ముందు రజాక్ నిలవలేక పోయింది..కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను ముగించింది.. గ్రూప్ స్టేజ్లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో పీవీ సింధు తలపడనుంది..