NATIONAL

భారత్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబం

అమరావతి: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌,, భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది..వారు నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ పర్యటనలో భాగంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు.భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఇరువురూ చర్చించనున్నారు. ఈ పర్యటనలో జేడా వాన్స్‌ ఫ్యామిలీ రాజస్థాన్‌ జైపూర్‌, ఆగ్రాను సందర్శిస్తారు.24వ తేదీన తమ పర్యటనను ముగించుకుని వాషింగ్టన్‌ డీసీకి బయల్దేరి వెళ్తారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *