CRIMENATIONAL

రూ.500 నోట్ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు

‘E’కి బదులు ‘A’…..

అమరావతి: కొత్త రకం నకిలీ రూ.500 కరెన్సీ నోటు చెలామణిలోకి రావడంపై హోం మంత్రిత్వ శాఖ (MHA) ‘అధిక ప్రాముఖ్యత’ హెచ్చరిక జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఫేక్‌ రూ.500 నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DIR), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU), కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIతో పంచుకున్నట్లు వెల్లడించింది.

ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత, అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. నకిలీ నోట్లను గుర్తించడం సులభం కాదని,, చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు..ఈ నకిలీ నోట్లపే ముద్రించే ద్రోహులు ఒక స్పెల్లింగ్‌ మిస్టేక్‌ తప్పించలేక పోయారని,,దాన్ని గుర్తించడమే కీలకమని తెలిపింది. ‘RESERVE BANK OF INDIA’ అనే పదంలో ‘RESERVE’ పదంలో ‘E’కి బదులు ‘A’ పడినట్లు వెల్లడించింది. నోటును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పును గుర్తించొచ్చని తెలిపింది.దింతో అది ఫేక్‌ నోటా లేక ఒరిజినల్‌ నోటా అనేది తెలుస్తుందని సూచించింది. ఈ ఫేక్‌ నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లో చెలామణీ అవుతున్నట్లు తెలిపింది. వాటిపై ముద్రించే సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని పేర్కొంది.. నకిలీ నోట్ల విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *