NATIONALOTHERSWORLD

కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్ను మూత

అమరావతి: అనారోగ్యంతో బాధపడుతూ కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) మరణించారు..పోప్ ఫ్రాన్సిస్ మరణం తరువాత రోమన్ కాథలిక్ చర్చిలో ఎలాంటి కత్రువులు జరుగుతుందన్న వివరాలపై వాటికన్ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుత పోప్ (పోప్ ఫ్రాన్సిస్) రోమన్ కాథలిక్ చర్చికి నాయకుడిగా ఉన్న సమయం అధికారికంగా ముగుస్తుంది. తదుపరి పాపసీ ప్రారంభమవుతుంది. చర్చి తదుపరి ఆధ్యాత్మిక నాయకుడిగా కొత్త పోప్ ఎంపికకు ప్రక్రియ ప్రారంభం కానున్నది. పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని పోప్ చాంబర్‌లైన్, కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారికంగా ధ్రువీకరిస్తారు. తరువాత పోప్ ప్రైవేట్ అపార్ట్మెంట్‌ను మూసివేసి అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తారు. కామెర్లెంగో అంటే కాథలిక్ చర్చిలో ఓ వ్యక్తికి ఇచ్చే ప్రత్యేక పేరు. పోప్ చనిపోయినప్పుడు చర్చి వ్యవహారాలకు బాధ్యత వహించే వ్యక్తే కామెర్లెంగో. కొత్త పోప్‌ను ఎంచుకునే వరకు సంప్రదాయం ప్రకారం ప్రతిదీ పూర్తయిందని నిర్ధారిస్తారు. కామెర్లెంగోతో పాటు ఆయన ముగ్గురు సహాయకులు కలిసి, పోప్ శవపేటికను సెయింట్ పీటర్స్ బాసిలికాలోకి ఎప్పుడు తీసుకెళ్లాలో నిర్ణయిస్తారు. అక్కడ పోప్‌ ఫ్రాన్సిస్ పార్థివ దేహాన్ని ప్రజలు చూడొచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *