విజయవంతమైన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ టెస్ట్ ఫైర్
INS సూరత్ నుంచి..
అమరావతి: భారత నావికాదళం గురువారం ఇజ్రాయిల్ సహకారంతో స్వదేశంలో తయారు చేసిన(MR-SAM) గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ క్షిపణిని,,అరేబియా సముద్రంలో విశాఖ క్లాస్ INS సూరత్ నుంచి టెస్ట్ ఫైర్ చేసింది..సముద్ర ఉపరితలంపై నుంచి తక్కువ ఎత్తులో ప్రయాణించి ఆకాశంలో లక్ష్యాలను ఛేదిస్తుంది..మీడియం రేంజ్ విభాగంలోకి వచ్చే ఈ క్షిపణి 70 కీ.మీ దూరం వరకు ప్రయాణిస్తుంది..పరీక్షా ప్రయోగంకు సంబంధించి వీడియోను భారత నావికాదళం విడుదల చేస్తూ,,ఐఎన్ఎస్ సూరత్ నుంచి ప్రయాగించిన క్షిపణి,, తన లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుని నాశనం చేసిందని ప్రకటించింది.. ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది.. ఈ రోజు లేదా రేపు పాకిస్తాన్ కరాచీ తీరప్రాంతం నుంచి పాకిస్తాన్ కు సంబంధించి ప్రత్యేక ప్రాంతం పరిధిలో,, ఉపరితలం నుంచి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షను నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో మన టెస్ట్ ఫైర్ జరగడం విశేషం.