వేసవి సీజన్ లో జమ్ముకశ్మీర్లో పర్యాటకం విలువ దాదాపు రూ.8 వేల కోట్లు?
జీనాధారం కోల్పోతున్న…
అమరావతి: జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం చోటు చేసుకున్న కిరాతకమైన ఉగ్రదాడితో అక్కడి పర్యాటక పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది..ఒక అంచనా ప్రకారం ఈ వేసవి సీజన్ లో దాదాపు రూ.8 వేల కోట్ల రూపాయల టూరిజంకు సంబందించి వ్యాపారం జరిగేది..దింతో స్థానిక కాశ్మీరులు ఆర్దికంగా నిలదొక్కుకునే వారు..ఈ ఘటన కారణంగా ప్రధాన ఆదాయ వనరుగా జీవిస్తున్న స్థానికులు తమ జీనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.. పహల్గాంలో పర్యాటకులు రాక పోతే,,వివిధ దుకాణాల ద్వారా పర్యాటకులకు అవసరమైన వస్తువులను విక్రయిస్తూ కొందరు,, హోటల్లు,, రెస్టారెంట్ల ద్వారా పర్యాటకులకు భోజనం,,రూమ్స్ సౌకర్యాలు కల్పిస్తూ మరి కొందరు జీవిస్తున్నారు.. వారి దగ్గర వివిధ పనులు చేస్తూ పలువురు కూలీలు,,కార్మికులు ఉపాధి పొందుతున్నారు..ఉగ్రవాదుల దాడితో అక్కడ భయానక వాతావరణం నెలకొనడంతో, పర్యాటకులంతా పహల్గాం నుంచి తిరిగి వెళ్లిపోయారు.. పలువురు స్థానికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లారు..దింతో అక్కడి దుకాణాలు,, హోటళ్లు మూతపడ్డాయి..పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము బతికేదెలా అని వారు ఆందోళన చెందుతున్నారు.