ప్రపంచంలో ఏ మూల దాక్కున్న ఉగ్రవాదులను వేటాడి శిక్షిస్తాం-ప్రధాని మోదీ
అమరావతి: జమ్ము కశ్మీర్లో మినీ స్వీజర్ ల్యాండ్ గా పిలుచుకునే ప్రముఖ పర్యాటక ప్రాంతం అయే పెహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు..పెహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి,,అమాయకుల ప్రాణాలు తీశారన్నారని అవేదన వ్యక్తం చేశారు..గురువారం బీహార్లోని మధుబనిలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించి,, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు..అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ… పెహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు…అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు బలిగొన్నారు.. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు…భారతదేశంపై జరిగిన దాడి…ఈ దాడిని భారత్ ఎన్నటికీ క్షమించదు… ప్రపంచంలో ఏ మూల దాక్కున్న ఉగ్రవాదులను వేటాడి శిక్షిస్తాం… కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం…ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది…దేశ ప్రజలకు మాటిస్తున్నా… ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం… ఉగ్రనేతలను కూడా విడిచిపెట్టే లేదు…ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతోంది అంటూ ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక చేశారు.