కూలీలు అనే పదం ఉపయోగించ వద్దు-డిప్యూటీ సీఎం పవన్
అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న వారిని కూలీలు అనే పదం ఉపయోగించ రాదని,,కూలీలకు బదులుగా శ్రామికులు అనే పదం ఉపయోగించాలని పంచాయితీరాజ్ శాఖాధికారులకు సూచించారు..అలాగే జాతీయ భావలతో గ్రామాలు స్వయంప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని,,పంచాయతీలకు కేటాయించిన నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు సూచించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు..గుంటూరు జిల్లా మంగళగిరి సి.కె. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఉపాధి హామీ పథకం స్టాళ్లను పరిశీలించిన పవన్ కల్యాణ్, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులపై ఫొటో ప్రదర్శనను పరిశీలించారు..ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు పవన్ కల్యాణ్,, అధికారులు సంతాపం తెలిపారు..
అధికారులు, ఉద్యోగుల సహకారంతో అనతికాలంలోనే 1060 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించినట్లు వెల్లడించారు..దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణతేజకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు..పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలనే చిత్తశుద్ధితో పనిచేసినట్లు పవన్ తెలిపారు.. డబ్బులు, సిఫార్సులు లేకుండా పంచాయతీరాజ్లో బదిలీల ప్రక్రియ చేశామన్నారు..పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు..ప్రతి పంచాయితీలో కలప చెట్లను నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సి అవశ్యకతను అయన సర్పంచులు,zptc,mptc,mppలకు వివరించారు..వివిధ పథకాలను సమర్దవంతంగా ఆమలు చేసిన అధికారులను డిప్యూటీ సీఎం,అభినందన పత్రంతో సత్కరించారు.