AP&TGDISTRICTS

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే,ఎంతటి దారుణం-పవన్ కళ్యాణ్

నెల్లూరు: తన తండ్రిని తన కళ్ల ముందే కాల్చివేస్తే,,ఆ పిల్లల మానసిక స్థితి ఎంతో దారుణంగా వుంటుందొ ఆర్దం చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు..గురువారం పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో కావలి వాసి సోమిశెట్టి.మధుసూదనరావు భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

ఈ సందర్బంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తన తండ్రిని తన కళ్ల ముందే కాల్చివేస్తే,,ఆ పిల్లల మానసిక స్థితి ఎంతో దారుణంగా వుంటుందొ ఆర్దం చేసుకోవచ్చన్నారు..జరిగిన సంఘటన గురించి అయన కుటుంబ సభ్యులు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని మండిపడ్డారు.. కుటుంబ సభ్యుల ముందు మధుసూదనరావు దారుణంగా చంపివేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరివేయ్యాలని,, తాను ప్రస్తుతం మాట్లాడలేక పోతున్నానని,,రేపో, ఎల్లుండో మంగళగిరిలో ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు..శుక్రవారం వైజాగ్ కూడా వెళుతున్నానని చెప్పారు.. ఎంత పైశాచికంగా,,ఒక పథకం ప్రకారం,,దారుణంగా చంపేశారన్నారు..కాశ్మీర్ రెండేళ్లుగా ప్రశాంతంగా ఉందనే ఇంతటి దారుణానికి, కిరాతకానికి పాల్పడ్డారని మండిపడ్డారు..ఉప ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,సత్యకుమార్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *