టెర్రరిస్టు ఇళ్లను బాంబులతో పేల్చివేస్తున్న భద్రత బలగాలు
అమరావతి: పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది..లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు,, అనుమానితుల కోసం తీవ్రంగా వేట కొనసాగిస్తోంది.. జమ్ము కశ్మీర్లోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు పేల్చేశాయి..షోపియాలోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి..అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసంతోపాటు ఇదే జిల్లాలో లష్కరే ముఠాకు చెందిన మరో ఉగ్రవాది అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి..కుల్గాంలోని ముర్రా ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇల్లు,,పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో ముష్కరుడు హరీస్ అహ్మద్ ఇంటిని బాంబులతో పేల్చేశాయి.
భద్రతా బలగాలపై టెర్రరిస్టుల ట్రాప్:- శుక్రవారం ఉదయం పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ,, దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళాలు వస్తాయని ఊహించి ఆర్మీబలగాలు రాగానే యాక్టివేట్ అయ్యేలా ఐఈడీలు ఉంచాడు.. అతను ఊహించినట్టే ఇంటిని తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్ పోలీసులు వెళ్లారు..వారు ఇంట్లోకి రాగానే పేలుడు పదార్థాలు యాక్టివ్ అయ్యాయి..ఇది గుర్తించిన పోలీసులు వెంటనే బయటకు వచ్చిన కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి..మరో ఉగ్రవాది ఆదిల్ థోకర్ ఇంట్లో కూడా ఇలాగే బాంబు ద్వారా ట్రాప్ పెట్టినా పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది..ఈ పేలుళ్లతో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.