NATIONAL

1200 మందికి పైగా అక్రమ బంగ్లాదేశీయులను అరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు

అమరావతి: గుజరాత్‌లోని అహ్మదాబాద్ & సూరత్ లో 1200 మందికి పైగా అక్రమ బంగ్లాదేశీయులను పోలీసులు చేశారు..వీరంతా ఆక్రమ చొరబాటుదారులు..పశ్చిమ బెంగాల్‌లో వీరంతా తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేసుకుని రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు..శనివారం వేకువజామున 3 గంటల నుంచి గుజరాత్‌లోని పలు పట్టణాలు,, నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.. అహ్మదాబాద్‌లో 890 మందిని,, సూరత్‌లో 134 మంది బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు..వీరంతా పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించినట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోనే ఫోర్జరీ ప్రతాలు సంపాదించి, దేశంలోని వివిధ ప్రాంతాలకు వారు వెళ్లినట్లు ఆయన తెలిపారు..”బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అక్రమ వలసదారుల్లో చాలా మంది డ్రగ్స్‌,, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారన్నారు..ఇటీవల 4 బంగ్లాదేశీయులను అరెస్టు చేయగా, వారిలో ఇద్దరు అల్‌ఖైదా స్లీపర్‌ సెల్స్‌ తో కలిసి పనిచేస్తున్నట్లుగా గుర్తించామన్నారు..దింతో భారీ ఆపరేషన్‌ చేపట్టడడం జరిగిందని,,వీరందరి పత్రాలను పరిశీలించిన తరువాత మన దేశం నుంచి పంపించి వేస్తామన్నారు.. అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *