భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజ్ వెబ్సైట్ హ్యాక్
అమరావతి: భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజ్ వెబ్సైట్ ను శుక్రవారం సాయంత్రం హ్యాక్ అయింది.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 4 రోజుల తర్వాత,, ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్సైట్ను పాకిస్తాన్కు చెందిన టీమ్ ఇన్సేన్ పికె అనే హ్యాకర్ గ్రూప్ హ్యాక్ చేసిందని నర్సింగ్ కాలేజ్కి చెందిన అధికారులు ఆరోపించారు.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం,, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ సలహాదారులను “పర్సనా నాన్ గ్రాటా”గా ప్రకటించడం వంటి 5 కఠినమైన చర్యలను భారతదేశం పాకిస్తాన్పై ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ హ్యాకర్ దాడి జరిగింది..శుక్రవారం సాయంత్రం ఆ సంస్థ ల్యాండింగ్ పేజీలో “మీరు హ్యాక్ చేయబడ్డారు !!! టీమ్ ఇన్సేన్ పీకే” అనే లైన్ ఉన్న బ్యానర్ ఉంది..దాని కింద ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు..ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ అని,, కంప్యూటర్ భద్రతా సంఘటనలపై స్పందించడానికి జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) సహాయం తీసుకోవలసి ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి..ఈ నర్సింగ్ కళాశాల జలంధర్ కంటోన్మెంట్లో ఉంది.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్ చేరుకున్నారు.. ఆయన వెంట 15 కాప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ, విక్టర్ ఫోర్స్ కమాండర్ ఉన్నారు.. జనరల్ ద్వివేది LoC, ఇతర సరిహద్దు ప్రాంతాలపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్నారు.. బలగాల మోహరింపు, ఇంటెలిజెన్స్ సమాచారం, చొరబాట్ల నిరోధక చర్యలను సీనియర్ అధికారులు వివరిస్తారు..పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదాన్ని పూర్తిగా తూడిచిపెట్టేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ వెంటనే దౌత్యపరమైన ఒత్తిడిని తీవ్రతరం చేయడమే కాకుండా, పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేని విధంగా సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.. సైనిక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది..పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అలర్ట్ ప్రకటించాయి.. జమ్మూకశ్మీర్ నుంచి అరేబియన్ సముద్రం వరకూ త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు.