NATIONAL

భారత వైమానిక దళం నిర్వహిస్తున్న ఆపరేషన్ “ఆక్రమణ్” ఎక్సర్‌సైజ్‌

అమరావతి: భారత వైమానిక దళం ప్రస్తుతం శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకుని పోయి,,ఖచ్చితమైన వైమానిక దాడులను చేసేందుకు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి డ్రిల్ నిర్వహిస్తొంది.. రాఫెల్ ఫైటర్ జెట్‌ల వంటి ఫ్రంట్‌లైన్ వింగ్స్ ను,,భారీ ఎలక్ట్రానిక్ యుద్ధానికి కారణమయ్యే సంక్లిష్టమైన వార్ ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నాయి..ఇందులో రాఫెల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను భారత్ సైన్యం ఉపయోగిస్తొంది..శత్రు దేశ సిగ్నల్స్‌ ను జామ్ చేయడం,,లేదా వాటికి అంతరాయం కలిగించడం వంటి వాటి కోసం ఎక్సర్‌సైజ్‌ చేస్తోంది..శత్రు దేశ కమ్యూనికేషన్,, రాడార్ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తే మన యుద్ధవిమానాల ఆచూకిని వాళ్లు కనుగొన లేరు..దీంతో మన యుద్ధ విమానాలు టార్గెట్లను సులభంగా ఛేదించి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం ఈ ట్రైనింగ్‌ డ్రిల్ సెంట్రల్‌ ఇండియాలో “ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్” పేరిట నిర్వహిస్తున్నారు.. ఈ డ్రిల్‌లో మనదేశ యుద్ధ విమానాల సన్నద్ధతను పరీక్షించడంతో పాటు శత్రు దేశ ఎయిర్‌ డిఫెన్స్‌ కు చెందిన ఎలక్ట్రానిక్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు అనుగుణంగా విన్యాసాలు చేస్తున్నారు..

రాఫెల్ జెట్‌లతో పాటు మనదేశానికి చెందిన వివిధ రకాల యుద్ధ విమానాలను ఈ విన్యాసాల కోసం తూర్పు సరిహద్దుల నుంచి సెంట్రల్‌ ఇండియాకు తరలించారు.. ఇది అంతర్గత విన్యాసం అని, పహల్గాం ఉగ్రవాద దాడికి ముందే ఈ ఎక్సర్‌సైజ్‌ను ప్రారంభించారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి..ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే SCALP MISSIELS ను రాఫెల్‌ జెట్లు మోసుకెళ్లి,,శత్రు దేశంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్లి,, దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులు చేసేందుకు భారత్‌ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల స్కాడ్రన్స్ ఇది..SCALP మిసైల్స్ లతో కూడిన రాఫెల్‌ జెట్లతో పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్ వంటి లక్ష్యాలపై దాడులు చేయవచ్చు.. ఇక్కడే లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ఉంటుంది..ఇదే సమయంలో శత్రుదేశం నుంచి వచ్చే యుద్ధ విమానాలు,,మిసైల్స్ ను కూల్చేయడానికి భారత్‌ ఎస్‌400 ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను కూడా మోహరించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *