ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025లో తెలంగాణ పోలీస్ ప్రథమ స్థానం
హైదరాబాద్: ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలీసు అధికారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,రాష్ట్ర డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రిని కలిసి ఇండియా జస్టిస్ రిపోర్ట్ లోని అంశాలను వివరించారు.