DISTRICTSEDU&JOBSOTHERS

ఇంటర్,10thలో ప్రతిభ చూపిన విద్యార్దులను అభినందించిన కలెక్టర్

నెల్లూరు: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆనంద్ మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు..ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ MPC పరీక్షల్లో 961 మార్కులు సాధించిన నెల్లూరు సాంఘిక సంక్షేమ కేంద్ర ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిలు సంగీత,, CECలో 927 మార్కులు సాధించిన మేఘన,, అలాగే పదవ తరగతిలో 574 మార్కులు సాధించిన వింజమూరు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థిని నందిని, 568 మార్కులు సాధించిన ఉలవపాడు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థిని ఎన్.కాజోల్ లక్ష్మి అగర్వాల్, 565 మార్కులు సాధించిన ఆత్మకూరు సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ విద్యార్థి సాయిధనుష్ తదితరులకు జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్ లో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదే ఒరవడి కొనసాగించి భవిష్యత్తులో మంచి చదువులు చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి శోభారాణి పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *