గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తుగ్లక్ పాలన-రానున్న మూడేళ్లలో రాజధానిని పూర్తి చేస్తాం-మంత్రి నారాయణ
నెల్లూరు: నగరంలో మొత్తం 46 పార్కుల్లో మాస్టర్ ప్లాన్ తో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని, ఈనెల 23 నుంచి పిల్లలకు వేసవి సెలవులు ఉన్నందున పార్కులను సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు.నారాయణ చెప్పారు..శనివారం నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ పరిధిలో,రాయపాలెం అంబేద్కర్ పార్కును స్థానిక చిన్నారుతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ప్రాజెక్టులను వచ్చే నెల 15లోగా ప్రారంభించి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నెల్లూరులో 3 లక్షల కుటుంబాలకు 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తాంమన్నారు. గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కోసం 5000 చెల్లించాల్సి ఉండగా దానిని కేవలం ఒక్క రూపాయి తీసుకొని కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగిందని మంత్రి చెప్పారు. ప్రజలు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం:- 2014-19లో 34 వేల ఎకరాలు ఇవ్వడం జరిగిందని, 64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని మరో 3 సంవత్సరాలు పూర్తి చేస్తామన్న మంత్రి ప్రజాభిప్రాయంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టుతున్నామని తెలిపారు.రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలని అందుకోసం ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామన్నారురానున్న 50 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని ఒక ఏర్పోర్ట్, స్పోర్ట్ సిటీని ఏర్పాటుకు 8వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని మంత్రి చెప్పారు.ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, టిడిపి సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.