మిథున్ చక్రవర్తికి ”దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డు
అమరావతి: సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ఒకటైన ”దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు” ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి వరించింది.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ఆశ్విని వైష్టవ్ సోమవారం ప్రకటించారు.. అక్టోబర్ 8వ తేదిన జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందచేయనున్నట్లు వెల్లడించింది..మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు.. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు.. ‘డిస్కో డాన్సర్’ చిత్రం ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందారు..సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ సంవత్సరం జనవరిలో పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది.