హర్యానాలో 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకున్న బీజెపీ
అమరావతి: హర్యానాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది..తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చినా అటు తరువాత ఆ పార్టీ వెనబడింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు గానూ బీజేపీ ఇప్పటికే 50 స్థానాల్లో విజయం సాధించింది.. ప్రతిపక్ష కాంగ్రెస్ 34 స్థానాల్లో విజయం సాధించింది. ఐఎన్ఎల్డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతానే తెరవలేదు.