ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదు-కేంద్ర మంత్రి అమిత్ షా
అమరావతి: ప్రతిపక్ష నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు ఆర్టికల్ 370 అంటూ మాట్లాడడం దారుణమని,, నేను దేశ ప్రజలకు తెలియ చేస్తున్నాను, ఇకపై ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.. జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉచిత పథకాలతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మేనిఫెస్టోను ‘సంకల్ప్ పత్ర్’ పేరుతో శుక్రవారం విడుదల చేశారు..ఈ సందర్బంలో హోం మంత్రి మాట్లాడుతూ ఈ ఆర్టికల్ యువత చేతుల్లో ఆయుధాలు, రాళ్లను మాత్రమే ఇచ్చిందని,, యువత ఉగ్రవాదం వైపు నడిచేలా చేసిందని మండిపడ్డారు..గడిచిన 10 సంవత్సరాల్లో జమ్ముకశ్మీర్ స్వర్ణ యుగాన్ని చూసిందన్నారు.. శాంతి, అభివృద్ధి, పురోగతి అభివృద్ధికి హామీ ఇచ్చిందని తెలిపారు..అనంతరం ప్రతిపక్షాలపై మండిపడ్డారు. “నేను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎజెండా ఏమిటో చూశాను, ఎన్సీకి కాంగ్రెస్ మౌనంగా మద్దతు ఇస్తుండటం కూడా చూస్తూన్నమని” అన్నారు..నేను ఒమర్ అబ్దుల్లాకు ఒకటే చెప్పదలచుకున్నా, ఎన్నికల ఫలితాలు ఏమైనా కానీ, గుజ్జర్లకు ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి ఎవ్వరినీ వెళ్లనివ్వం..జమ్ముకశ్మీర్లో తీవ్రవాదం ఆవిర్భావానికి బాధ్యులెవరో నిర్ధరించడానికి శ్వేతపత్రం విడుదల చేస్తాం..ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాన్నమన్నారు..
ఓటర్లపై వరాల జల్లు:-‘మా సమ్మాన్ యోజన’ కింద ప్రతి కుటంబంలోని వృద్ధ మహిళకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని ప్రకటించారు. ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు..ప్రగతి శిక్ష యోజన కింద కాలేజీ విద్యార్థులకు ఏడాదికి రూ.3000 చొప్పున ఇస్తామని అమిత్ షా ప్రకటించారు..ఈ ప్రాంత అభివృద్ధికి భరోసా ఇచ్చేందుకు మాకు ఐదేళ్ల పదవీ కాలం ఇవ్వాలని జమ్ముకశ్మీర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని అమిత్ షా అన్నారు.
#WATCH | Jammu, J&K | Union Home Minster Amit Shah says, "I have seen the NC's (National Conference) agenda. I have also seen Congress silently supporting NC's agenda. But, I want to say to the country that Article 370 is history, it will never return, and we won't let it happen.… pic.twitter.com/nXJhBNYClS
— ANI (@ANI) September 6, 2024