ఆస్థి,ఖాళీ స్థలం పన్నులు మొత్తం కలిపి రూ.77.76 కోట్లు వసూళ్లు-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో 2024-25 ఆర్ధిక సంవత్సరం పన్నుల వసూళ్లలో విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయం అని కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూళ్లను కమిషనర్ వివరిస్తూ,గత ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 31-03-25 వ తేదీ వరకు ఆస్థి పన్ను మొత్తం రూ.70,14,02,787/- కోట్లు కాగా ఖాళీ స్థలం పన్నులు రూ.7,62,06,972/- కోట్లు, తాగునీటి కుళాయి పన్ను రూ.9,85,83,800/- కోట్ల రూపాయలను వసూలు చేశామని తెలిపారు. ఆస్థి పన్ను, ఖాళీ స్థలం పన్నులు మొత్తం కలిపి రూ.77,76,09,759/- కోట్ల రూపాయలను వసూలు చేసారని తెలిపారు. 31-03-25 తేదీ ఒక్కరోజునే రూ.2.85 కోట్ల రూపాయల పన్నులను వసూలు చేసి రెవెన్యూ విభాగం సత్తా చాటుకున్నారని కమిషనర్ ప్రశంసించారు. గత ఏడాది ఆస్థి పన్ను, రూ.58.58 కోట్లు, ఖాళీ స్థలం పన్ను రూ. 7.80/- కోట్లతో మొత్తం రూ.66.38/- కోట్లు కాగా ఈ ఏడాది వసూళ్లలో రూ.11.38/- కోట్లను అదనంగా వసూలు చేయడంలో రెవెన్యూ విభాగం, ఇంజనీరింగ్ అధికారులు, వార్డు సచివాలయ అడ్మిన్, అమెనిటీస్ కార్యదర్శులు చురుకుగా విధులను నిర్వర్తించారని కమిషనర్ అభినందనలు తెలిపారు.