CRIMEDISTRICTS

నెల్లూరులో జరిగిన కారు ప్రమాదంలో 5 మంది వైద్యవిద్యార్థులు మృతి

నెల్లూరు: కోవూరు పరిథిలోని పోతిరెడ్డిపాలెం వద్ద కారు రోడ్డుపక్కన మట్టిగుట్టను ఢీకొని పల్టీలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది..బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు,,ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య అనే వ్యక్తి మృతి చెందారు..మరణించిన 5 మంది యువకులు నారాయణ వైద్యకళాశాల వైద్యవిద్యార్థులుగా గుర్తించారు..వీరు నారాయణ మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా గుర్తించారు..వీరంతా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా అతి వేగంగా కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు వ్యాఖ్యనిస్తున్నారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *