NATIONAL

జాతీయ భద్రతా సలహా బోర్డును పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది హిందు పర్యటకులు మరణించడంతో, భారతదేశం ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఫ్రణాళికలు సిద్దం చేసుకొంటుంది..దింతో ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్-భారత మధ్య ఉద్రిక్తతలు కొనసాతున్నాయి..బుధవారం మరోవైపు సారి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS), రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA), ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశాలు జరిగాయి.. పాక్​తో ఉద్రిక్త పరిస్థతుల నేపథ్యంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, హోంమంత్రి అమిత్‌ షా, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

 జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునరుద్ధరించింది.. బోర్డు ఛైర్మన్‌గా రా మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని నియమించింది..అలాగే 7మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ బోర్డులో విశ్రాంత మిలిటరీ,,ఐపీఎస్‌,, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు ఉంటారు.. బోర్డు సభ్యులుగా PM సిన్హా, AK సింగ్, మోంటీ ఖన్నా, మాజీ IASలు రాజీవ్‌ రంజన్‌ వర్మ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ IFS అధికారి B. వెంకటేశ్‌ వర్మలకు చోటు కల్పించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *