డిశంబరు 31న రూ.403 కోట్ల మద్యంను స్వాహా చేసిన మందుబాబులు
హైదరాబాద్: న్యూయర్ సందర్బంగా తెలంగాణలో మద్యం ఉప్పొగింది..తెలంగాణ ఎక్సైజ్శాఖ చరిత్రలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి..ఒక్క మంగళవారం రోజులోనే దాదాపు రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి..డిసెంబర్ 28 నుంచి జనవరి 1వ తేది ఉదయం వరకు కేవలం 5 రోజుల్లోనే దాదాపు రూ.1,800 కోట్ల విలువైన మద్యం మందుబాబులు స్వాహా చేశారని ఎక్సైజ్శాఖ అధికారలు తెలిపారు..30వ తేదీన రూ.402.62 కోట్లు మద్యం అమ్ముడు అయ్యాయి.