AP&TG

రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం,,అంతర్గత భద్రతకు ప్రమాదం-పవన్ కళ్యాణ్

అమరావతి: దేశంలోకి ఆక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం,,అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చారు.. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్ కత నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారన్నారు..రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయని,,వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోందన్నారు..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు అన్నారు.. రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు..మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని తెలిపారు..రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉందన్నారు.. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాల్సి వుందన్నారు.. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుందన్నారు.. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాల్సి వుందన్నారు.. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తూ లేఖ రాశానని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *