ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు-పవన్ కళ్యాణ్
అమరావతి: 140 కోట్ల మంది ప్రజల బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి వన్ కళ్యాణ్ అన్నారు..శనివారం అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులను ప్రాంరంభించేందుకు ప్రధాని మోదీ వచ్చిన సందర్బంలో వేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని ప్రాంత రైతుల త్యాగాలను ప్రధాని మోడీ గుర్తించారని తెలిపారు.. గత ప్రభుత్వం రాజధాని అమరావతి భవిష్యత్తును తుడిచి పెట్టేసిందని మండిపడ్డారు..5 సంవత్సరాల కాలంలో అమరావతి ప్రజలు నలిగిపోయరని,, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేసిందని అమరావతిని అవమానపరిచిన అన్నారు..ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారని తెలిపారు..అమరావతి రైతులు గడిచిన ఐదు సంవత్సరాలుగా పోరాడారని మహిళలు ధర్మయుద్ధం చేశారని తెలిపారు..అమరావతి రైతులకు అండగా ఉంటామని గతంలోనే చెప్పామన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని మోడీ ప్రారంభిస్తారని తెలిపారు.. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది దారుణంగా చంపిన నేపధ్యంలో అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వున్నప్పటికి ప్రధాని మోడీ ఈ రోజు ఇక్కడ వచ్చారని చెప్పారు.