విశాఖలోని రూ.500 కోట్ల భూములను మింగేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ఎత్తులు…చిత్తు?
సురేష్ ప్రొడక్షన్స్ కు సుప్రీంలో చుక్కెదురు…
అమరావతి: విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఫిల్మ్సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్కు అనుమతించింది. ఈక్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈక్రమంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. మరోవైపు పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ కోరగా ధర్మాసనం అనుమతించింది.
రూ.500 కోట్ల విలువ చేసే భూముల నేపధ్యం….((((విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల కేటాయింపులు వివాదానికి దారి తీశాయి..సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా తేలడంతో 15 ఎకరాలు వెనక్కి తీసుకుని స్వాధీనం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. చిత్ర పరిశ్రమ ప్రోత్సహించేందుకు 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చి భూమి కేటాయించాలని అడిగింది..ధరఖాస్తూ పరిశీలన తర్వాత విశాఖ భీమునిపట్నం బీచ్ రోడ్డు ఆనుకుని సర్వే నెం-33.6Pలోని 33.44 ఎకరాల 5 లక్షల 22 వేల రూపాయలకు సురేష్ ప్రొడక్షన్స్ ఇస్తూ జీవో నెంబర్ 963 జారీ చేసింది.. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సగం భాగంలో ఫిలిమ్ స్టూడియో నిర్మాణం జరిగింది.. స్టూడియో పర్యాటకులకు సందర్శన ప్రాంతంగా మారింది.. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ 500 కోట్ల అంచనా.. స్టూడియోకు కేటాయించిన భూముల్లో సినిమాకు సంబంధించి కార్యక్రమాలు జరగాలి.. సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనలు గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది.. ఈ కథంతా గత ప్రభుత్వంలో పెద్దలు నడిపారు అనేది కూటమి నేతల ఆరోపణ.. భూమి సర్వేనెంబర్ లో ఉన్న తప్పులు సవరించుకుని సిద్ధం చేసుకుని,, సురేష్ ప్రొడక్షన్స్ కేటాయింపుల్లో జరిగిన తర్వాత నిర్దిష్టమైన సమయంలో వినియోగించుకోనట్టయితే, కేటాయింపులు రద్దు చేసే అవకాశం ఉందని వ్యవహారంపై వైసీపీ పాలన సమయంలో చర్చ కొచ్చింది..అలాగే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చర్చ నడిచింది. అందుకు భిన్నంగా 15 ఎకరాల భూ వినియోగ మార్పిడి కోసం అప్లై చేసి సురేష్ ప్రొడక్షన్స్,,రియల్ ఎస్టేట్ వేస్తున్నామని దానికి అనుమతి ఇవ్వాలని GVMCకి 2023లో దరఖాస్తు పెట్టింది.. అనుమతులు రాక ముందే లే అవుట్లు వేసి ప్లాట్లుగా విభజించింది..వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా నడిచిందని ఆరోపణలు వచ్చాయి..ఈ నేపథ్యంలో తెరవెనుక ఒప్పందాలు చేధించేందుకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు భూ మార్పిడి వ్యవహారాలపై న్యాయ పోరాటం ప్రారంభించారు,. దినిపై ఎమ్మెల్యే సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఫిర్యాదుపై విచారణ చేట్టి,, రియల్ ఎస్టేట్ గా మారిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది..రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతం పై హెడ్ లైన్ కు 500 మీటర్ల దూరంలోనే ఉంది. అటువంటి ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాలి..ఈ ప్రాంతమంతా CRZ జోన్ కావడంతో ఇక్కడ నిర్మాణాలకు కేంద్రం అనుమతులు పొందాల్సి వుంటుంది..అయితే వైసీపీ పాలనలో స్థానికంగానే అధికారులు అనుమతులు ఇచ్చేశారు.)))