AP&TG

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి-ప్రధాని మోదీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం  శంకుస్థాపనలు,,ప్రారంభోత్సవాలు చేశారు.. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని మోదీ అన్నారు.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..అమరావతి స్వప్నం సాకారం చేసుకునే  దిశగా  సంస్కృతి,,చారిత్ర,, ప్రగతి కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.. ఒక కొత్త అమరావతి,,నూతన ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని,, మాత దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు..వీరభద్రుడు,, అమరలింగేశ్వరుడు,తిరుపతి బాలాజీ,, బౌద్ధ వారసత్వం,, ప్రగతి కలగలిపిన ఈ పుణ్యభూమిపై నేను నిలబడి ఉన్నాను అని పేర్కొన్నారు..

ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని,,నేడు చేసినవి శంకుస్థాపనలు మాత్రమే కాదు,, ఆంధ్రప్రదేశ్‌ ప్రగతికి,, వికసిత్ భారత్‌కు నిదర్శనం అన్నారు.. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం అని,, రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌ లో కలలు కనే వారు ఎక్కువే అలాగే కలలను నిజం చేసుకునే వారు కూడా ఎక్కువ అంటూ కితాబు ఇచ్చారు..చంద్రబాబు..నేను ఉపయోగించే టెక్నాలజీ గురించి చెప్పారు అయితే గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు… ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను…. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా అని ప్రధాని మోదీ వెల్లడించారు..

రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు:- అమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు..మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *