అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో కాకాణికి రెండవసారి పోలీసు నోటీసులు
అమరావతి: మాజీ మంత్రి,,వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు..నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు..సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందచేసేందుకు అదివారం పోదలకూరు రోడ్డులోని అయన నివాసంకు వెళ్లిన పోలీసులు,,కాకాణి ఇంటిలో లేకపోవటంతో ఆ నోటీసులు ఇంటి ప్రధాన గేటుకు అంటించారు..నోటీసుల్లో సోమవారం ఉదయం 11గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు..కాకాణి సోమవారం విచారణకు హాజరు కాలేదు..ఉగాది పండుగను హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నట్లు సమాచారం.. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లగా,, అక్కడ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి లేకపోవటంతో ఆయన సోదరుడికి పోలీసులు నోటీసులు అందజేశారు.. ఏప్రిల్ 1నఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు..మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో పోలీసులు ముగ్గురురిని అరెస్టు చేశారు.. ముందస్తు బెయిల్ కోసం కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు..హైకోర్టులో విచారణ మంగళవారం నాటికి వాయిదా పడింది..మంగళవారం వరకు పోలీసులు అగుతారా? లేక ??అనేది వేచి చూడాల్సిందే.