AP&TG

రాష్ట్రంలొ రెడ్,ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నాయి..అలాగే ఈదురుగాలు తీవ్ర ఆస్థినష్టం జరుగుతొంది..పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్ అలర్ట్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ జారీ చేశారు.. రెడ్ అలెర్ట్:- ఆదివారం రాత్రికి ప్రకాశం,కృష్ణా,బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం,, గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం వుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.. ఆరెంజ్ అలెర్ట్:- అల్లూరి,విజయనగరం,అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం వున్నదని,, హోర్డింగ్స్,చెట్ల క్రింద,, శిథిలావస్థలో ఉన్న గోడలు,,భవనాలు దగ్గర నిలబడ కూడదన్నారు..ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *