రాష్ట్రంలొ రెడ్,ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నాయి..అలాగే ఈదురుగాలు తీవ్ర ఆస్థినష్టం జరుగుతొంది..పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్ అలర్ట్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ జారీ చేశారు.. రెడ్ అలెర్ట్:- ఆదివారం రాత్రికి ప్రకాశం,కృష్ణా,బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం,, గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం వుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.. ఆరెంజ్ అలెర్ట్:- అల్లూరి,విజయనగరం,అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం వున్నదని,, హోర్డింగ్స్,చెట్ల క్రింద,, శిథిలావస్థలో ఉన్న గోడలు,,భవనాలు దగ్గర నిలబడ కూడదన్నారు..ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.