AP&TG

ఉపముఖ్యమంత్రి పవన్ తో భేటీ అయిన అమెరికా కాన్సుల్ జనరల్

అమరావతి: అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ ​తో మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు..ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు.. జెన్నిఫర్ లార్సన్​ను, ఆమె బృందాన్ని పవన్ కల్యాణ్‌ సత్కరించారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్​ తెలిపారు..మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు దించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు.. తమ ప్రభుత్వం వైపు నుంచి పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *