రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన కేంద్రం ఆరోగ్య శాఖ
హైదరాబాద్: తెలంగాణాలో 4 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు,,ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త ప్రభుత్వ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు ఇస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..మంగళవారం తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్లోని మెడికల్ కళాశాలలు 2024- 25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చింది..ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభించ వచ్చని పేర్కొంది..ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 300 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి.