NATIONALPOLITICS

డీఎంకేను అధికారం నుంచి దించే వరకు పాదరక్షలు వేసుకోను-అన్నామలై

అమరావతి: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు.. గురువారం కోయంబత్తూరులో అయన మీడియా సమావేశంలో తాను వేసుకున్న షూస్ విప్పివేశాడు..ఈ సందర్బంలో అన్నామలై మాట్లాడుతూ, అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు..డీఎంకేను గద్దె దించేందుకు శుక్రవారం నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆరు ఆలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు.. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకోనున్నట్లు చెప్పారు..అయితే బీజేపీ కార్యకర్తలు ఎవరూ కొరడాలతో కొట్టుకోవద్దని ఆయన అభ్యర్థించారు..బీజేపీ కార్యకర్తలంతా తమ ఇళ్ల ముందే డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.. తమ ప్రాంతాల్లోని బాధిత మహిళలు, వారి కుటుంబాలకు బీజేపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌కు కూడా లేఖ రాయనున్నట్టు తెలిపారు.. మహిళలకు రక్షణ కల్పించలేని పార్టీకి,, అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు..తమిళనాడులో హుందా రాజకీయాలు లేవని అందుకే ఇక నుంచి తన రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నామలై చెప్పారు.. అన్నామలై అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు..నిర్భయ నిధులు వున్నప్పటికి,,అన్నాయూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని అనడం సిగ్గుచేటన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *