AP&TGPOLITICS

విశాఖ GVMC మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన కూటమి సభ్యులు

అమరావతి: విశాఖ GVMC మేయర్‌ గొలగాని హరివెంకట కుమారిపై శనివారం కూటమి సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది..సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరుకావడంతో సునాయసంగా అవిశ్వాసం నెగ్గారు..శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్న తరువాత ఓటింగ్ జరిగింది.. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది..ఇదే సమయంలో GVMC కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది.. వైసీపీ మేయర్ హరివెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి..

2021లో జరిగిన GVMC ఎన్నికల్లో, మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58 వార్డులను గెలుచుకుంది..దీంతో 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి మేయర్  అయ్యింది..ఇండిపెండెంట్‌లుగా గెలిచిన 4 కార్పొరేటర్లు,, టీడీపీ నుంచి గెలిచిన ఒక్కరు కూడా వైసీపీలో చేరారు..2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది టీడీపీ,, జనసేన పార్టీల్లో చేరిపోయారు..19 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి,, 9 మంది జనసేనలోకి వెళ్లారు..అలాగే ఇండిపెండెంట్‌ కార్పొరేటర్ల కూడా టీడీపీ,, జనసేన పార్టీలో చేరిపోయారు.. ఈ నేపధ్యంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ 58 మంది కార్పొరేటర్ల సంతకాలు చేసి గత నెల 21వ తేదిన జీవీఎంసీ ఇన్‌చార్జ్,,కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు..విశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *