CRIMENATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్‌ లో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ దారుణ హాత్య

భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటు రోడ్లపైకి,,టీవీలో చర్చలకు పరుగులు తీసే కూహాన లౌకికవాదులకు బంగ్లాదేశ్,,మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు,,మరణహోమాలపై నోరు మెదపరేందుకని ??

https://x.com/MEAIndia/status/1913500679303569705

 

అమరావతి: బంగ్లాదేశ్‌ లో మైనారిటీలు అయిన హిందువులపై దాడులు,,హింసలు రోజుకు రోజుకు పెరిగి పోతున్నాయి..తాజాగా ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ను కిడ్నాప్ చేసి,, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది..ఈ ఘటనను భారతదేశం తీవ్రంగా ఖండించింది.. మైనారిటీలు అయిన హిందువుల రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శనివారం ఒక ప్రకటన చేశారు.. “హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు మా దృష్టికి వచ్చింది.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో మరొకటి చేరింది.. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో వారు శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనారిటీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మరోసారి గుర్తుచేస్తున్నాం” అని రణ్‌ధీర్ జైశ్వాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు..

(బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్‌ బిరాల్ యూనిట్‌కు రాయ్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.)

58 ఏళ్ల బభేశ్ చంద్ర రాయ్‌ను ఇంటి నుంచి అపహరించి, కొట్టి చంపినట్టు ‘డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది..పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం,, బభేశ్ చంద్రరాయ్ ఇంటికి గురువారం ఒక ఫోన్ కాల్ వచ్చింది.. ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకుని,, బబేశ్ ఇంట్లోనే ఉన్నారని ఆమె చెప్పడంతో  30 నిమిషాల తరువాత నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి బబేష్‌ను తమవెంట నరబరి గ్రామానికి తీసుకెళ్లారు..అక్కడ ఆయనపై దారుణంగా దాడిచేయడంతో స్పృహ కోల్పోయిన దశలో ఇంటి వద్ద పడేసి వెళ్లి పోయారు..దింతో ఆయనను కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆయన మృతిచెందారు..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *