ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేసిన BJP
అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థుల తొలి జాబితను బీజెపీ శనివారం ప్రకటించింది.. ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్,, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను బరిలోకి దింపింది..ఇటీవలే ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్కు తొలి జాబితాలో చోటు దక్కింది.. ఆయన్ని బిజ్వాసన్ స్థానం నుంచి పోటీకి దింపింది.. కరోల్బాగ్ నుంచి దుశ్యంత్ చౌటాలా,, రాజౌరీ గార్డెన్ నుంచి మాజిందర్ సింగ్,, గాంధీ నగర్ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీ పోటీ చేయబోతున్నారు.