V.R HIG SCHOOL కు పూర్వ వైభవం తీసుకున్న వస్తాం-మంత్రి నారాయణ
నెల్లూరు: రాష్ట్రంలో నాలుగు ప్రాంతంలో(రాయలసీమ,ఉత్తరాంధ్ర,కృష్ణా,నెల్లూరుజిల్లాలో) కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంగీకరించారని రాష్ట్ర మునిసిపాల్,ఆర్బన్ డెవలెప్ మెంట్ శాఖ మంత్రి డాక్టరు.పొంగూరు.నారాయణ తెలిపారు.మంగళవారం నెల్లూరు నగరంలోని V.R HIG SCHOOL మంత్రి సందర్శించారు. అనతంరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నేను కూడా 6 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను అని తెలిపారు.2025 విద్యా సంవత్సరంలో స్కూల్,జూనియర్ కాలేజ్ లను అందించేందుకు విద్యాశాఖ&మునిసిపాల్ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నాయని వెల్లడించారు.గతంలో తాను V.R HIG SCHOOLల్లో ప్రారంభించిన రెసిడెన్సీల్ కాలేజ్ లో పేద వర్గాలకు చెందిన దాదాపు 300 విద్యార్ధిని విద్యార్దులు చదువుకున్నరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెసిడెన్సీల్ కాలేజ్ మూసివేసిందని అవేదన వ్యక్తం చేశారు. 2 వేల మంది పేద విద్యార్దులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాతో పాటు అన్ని సౌకర్యలు ఉచితంగా అందచేస్తామన్నారు.